ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై కాసేపట్లో విచారణ
ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో కాసేపట్లో విచారణ మొదలవుతుంది. హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపడుతుంది. సీబీఐ అధికారులు, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత హైకోర్టుకు చేరుకున్నారు. తల్లి అనారోగ్యం దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాశ్ తరపు లాయర్లు కోరనున్నారు. హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.