శంషాబాద్ విమానాశ్రయం లో రూ.14.2 కోట్ల విలువైన 2.027 కిలోల హెరాయిన్ పత్తివేత

శంషాబాద్ విమానాశ్రయం లో రూ.14.2 కోట్ల విలువైన 2.027 కిలోల హెరాయిన్ పత్తివేత

 ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి శంషాబాద్ విమానాశ్రయం లో రూ.14.2 కోట్ల విలువైన 2.027 కిలోల హెరాయిన్ ను విదేశీ మహిళ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు రిపబ్లిక్ ఆఫ్ బురుండి దేశస్థురాలిగా గుర్తించారు. నైరోబీ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుండీ 2.027 కిలోల హెరాయిన్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది దుస్తుల్లోని గుండీలు, మూడు సబ్బుల్లో దాచి తీసుకొచ్చిన హెరాయిన్ ప్యాకెట్లను సీజ్ చేశారు. నిందితురాలు రిపబ్లిక్ ఆఫ్ బురుండి దేశస్థురాలిగా గుర్తించామని, అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.