ఎమ్మెల్యే వ్యాపార పార్టీ సంస్థ మూతపడడం ఖాయ

ఎమ్మెల్యే వ్యాపార పార్టీ సంస్థ మూతపడడం ఖాయ
  •  జనసేన ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :  ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రజలకు కాదు మీ రాజకీయ వ్యాపార పార్టీకి మాత్రమే సీఈవోగా గుర్తించుకోవాలని జనసేన ఇన్చార్జ్ లక్ష్మణ్ గౌడ్, విమర్శించారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నియోజకవర్గనికి సీఈఓ గా పనిచేస్తున్నానని పేర్కొనడం దారుణమని ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి మాట తప్పినందుకు సీఈఓ నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో నల్లమట్టి విక్రయించుకోవడంలో సీఈఓ అని మిమ్ములను సబ్జా చేయడంలో సీఈవో అని అనుచరుల దోపిడీకి కబ్జాలకు మాఫియాకు వత్తాసు పలకడంలో మాత్రమే సీఈవోగా మారారని విమర్శించారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కంపెనీని నియోజకవర్గ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. మరి జనార్దన్ రెడ్డి వ్యాపారవేత్త కాబట్టే ఎన్నికలలో పెట్టుబడిపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించాలనే దానిపైనే దృష్టికి తప్ప సేవ చేయడంలో లేదని అన్నారు