ఇంటింటికి మోడీ పథకాలను వివరిస్తున్న కొండా మన్నెమ్మ

ఇంటింటికి మోడీ పథకాలను వివరిస్తున్న కొండా మన్నెమ్మ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:  జిల్లా కేంద్రంలో ఈశ్వర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొండ మన్నెమ్మ నాగేష్ ఆధ్వర్యంలో గడప గడపకు బిజెపి 9 సంవత్సరాల నరేంద్ర మోడీ  పాలన గురించి ఇంటింటికి వివరించడం జరిగింది ఆర్టికల్ 370 రామ మందిరం  నిర్మాణం అయోధ్యలో యూనిఫాం సివిల్ కోడ్ గురించి వారికి వివరించడం జరిగింది హౌసింగ్ బోర్డ్ కాలనీ మొత్తం రోడ్లు అస్తవ్యస్తంగా తయారైనవి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే  పట్టించుకోలేదు అని ప్రజలు విసుకు చెందుతున్నారు బి ఆర్ ఎస్  పార్టీ మీద.వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇంటింటి కార్యక్రమంలో జిల్లా ఫుల్ టైమర్ శరత్ బాబు విజయ భాస్కర్ రెడ్డి టౌన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు రాము యాదవ్ ఇంద్రసేనారెడ్డి చిన్న రాయుడు తదితరులు పాల్గొన్నారు.