రాజ్నాథ్ వ్యాఖ్యలు
![రాజ్నాథ్ వ్యాఖ్యలు](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64c35e69ece7c.jpg)
- శాంతి, సుస్థిరతలకు భంగం
- పాక్ విదేశాంగ ప్రకటన విడుదల
న్యూఢిల్లీ: భారత దేశ గౌరవ, ప్రతిష్ఠలను కాపాడుకోవడం కోసం నియంత్రణ రేఖ (ఎల్వోసీ)ని దాటి వెళ్లగలమని భారత దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం గురువారం స్పందించింది. మంత్రి దుందుడుకు వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ముప్పు కలిగిస్తాయని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని భారత్ను హెచ్చరించింది. దక్షిణాసియాలో వ్యూహాత్మక వాతావరణాన్ని రాజ్నాథ్ వ్యాఖ్యలు అస్థిరపరుస్తాయంది. కశ్మీరు, గిల్గిట్ -బాల్టిస్థాన్ల గురించి భారతీయ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడటం ఇదే తొలిసారి కాదని వ్యాఖ్యానించింది. ఒకవేళ భారత్ ఎల్వోసీని దాటే పరిస్థితే వస్తే ఆ దురాక్రమణను తాము అడ్డుకుంటామని తమను తాము కాపాడుకోగలిగే సత్తా పాక్ ఉందని స్పష్టం చేసింది. జూలై 26న కార్గిల్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్నివాళులర్పించిన అనంతరం ప్రసంగించారు. ఇందులో ఎల్వోసీ దాటే విషయంపై కుండబద్ధలు కొట్టారు.