పీఎన్బీ లాభాల్లో జూమ్
![పీఎన్బీ లాభాల్లో జూమ్](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64c36dde863c6.jpg)
- రూ. 1255 కోట్ల లాభాలు
- మొండిబకాయిల తగ్గుదల.. వడ్డీల ఆదాయం పెరగడంతో నాలుగు రెట్ల లాభాలు
ముంబై: తొలి త్రైమాసికం లాభాల్లో పీఎన్బీ (పంజాబ్నేషనల్ బ్యాంక్) హవా కొనసాగించింది. ఏకంగా రూ. 1255 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ లాభం నాలుగురెట్లు కావడం గమనార్హం. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో ఏడాది క్రితం వచ్చిన రూ.308 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.21,294 కోట్ల నుంచి రూ.28,579 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో బ్యాంక్కు వడ్డీల మీద రూ.25,145 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 11.2 శాతం నుంచి 7.73 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 4.26 శాతం నుంచి 1.98 శాతానికి దిగొచ్చాయి. మరోవైపు, మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.4,374 కోట్ల నిధులను వెచ్చించింది.