నేడు చార్మినార్‌ వద్ద బీఆర్ఎస్ ధర్నా.. పాల్గొననున్న కేటీఆర్‌

నేడు చార్మినార్‌ వద్ద బీఆర్ఎస్ ధర్నా.. పాల్గొననున్న కేటీఆర్‌

ముద్ర,హైదరాబాద్:-తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పిడిపై బీఆర్‌ఎస్‌ పార్టీ పోరుకు సిద్ధమైంది. అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ నాయకులతో కలిసి చార్మినార్‌కు చేరుకోనున్నారు.