డివైడర్ ను డికొన్న బైక్ - ఒకరు మృతి

డివైడర్ ను డికొన్న బైక్ - ఒకరు మృతి

తూప్రాన్, ముద్ర: ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ మండలం కళ్ళకల్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన బళ్లారి భాస్కర్ (22), శబాష్ పల్లి గ్రామానికి చెందిన పానగారి నరేష్ లు ద్విచక్ర వాహనంపై మేడ్చల్ వైపు నుండి తూప్రాన్ వైపు వస్తుండగా కాళ్ళకల్ జనతా హోటల్ సమీపంలోకి రాగానే బైక్ డివైడర్ ను ఢీకోంది. భాస్కర్ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.