ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీకి శ్రీకారం
- ప్రారంభించిన జిల్లా ఎన్నికల పరిశీలకుడు పృథ్వీరాజ్
ముద్ర ప్రతినిధి, మెదక్:సాధారణ ఎన్నికల్లో భాగంగా మెదక్ నియోజవర్గ పరిధిలో ఓటర్ సమాచార స్లిప్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. బుధవారం హవేలీ ఘనపూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో జిల్లా ఎన్నికల సాదారణ పరిశీలకుడు పృథ్వీరాజ్ బి.పి. ప్రారంభించారు. ఓటర్ స్లిప్ తోపాటు, ఓటర్ గైడ్, సి -విజిల్ కరపత్రాలు ప్రతి ఓటర్ కి అందించాలని అధికారులకు జిల్లా ఎన్నికల సాదారణ పరిశీలకుడు పృథ్వీరాజ్ బి పి సూచనలు, సలహాలు అందించారు.
ఈ సందర్భంగాగ్రామస్తులతో మాట్లాడుతూ ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా పారదర్శకంగా ఓటు వేయాలని ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని, రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరు తప్పనిసరిగా. వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రతి ఒక్కరు C-విజిల్ యాప్, టోల్ ఫ్రీ నెంబర్ 1950పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈనెల 30న జరిగే పోలింగ్ రోజు ప్రతి ఒక్కరు తమ ఓటును నిర్భయంగా, తప్పనిసరి గావినియోగించుకోవాలన్నారు.కార్యక్రమంలో మెదక్ ఆర్ఓ, ఆర్డిఓ అంబాదాస్ రాజేశ్వర్, ఏఆర్ఓ నారాయణ, డిటి చరణ్, బిఎల్ఓలు, ఎన్నికల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.