ట్రాక్టర్- కారు ఢీ: తల్లి, కూతురు మృతి

ట్రాక్టర్- కారు ఢీ: తల్లి, కూతురు మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ - హైదరాబాద్ నేషనల్ హైవే పై కౌడిపల్లి మండలం అంతారం గేట్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి ట్రాక్టర్  - కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లి,  కూతురు మృతిచెందారు మృతులు కౌడిపల్లి మండలం కంచన్ పల్లి గ్రామానికి చెందిన తల్లి, కూతురు శ్రీలత, స్వరూపగా గుర్తించారు. భర్త మల్లేశంకు తీవ్ర గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.