ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో జయశంకర్ జయంతి వేడుకలు
![ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో జయశంకర్ జయంతి వేడుకలు](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64cf560f5db01.jpg)
ముద్ర ప్రతినిధి, మెదక్:తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు యం.గంగాధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ సార్ సేవలను కొనియాడారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ తన జీవితాంతం కష్టపడ్డారని పేర్కొన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. జయశంకర్ ఆశయాల సాధానకు చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఉమర్, నాయకులు పెరికె కిషన్, నాగేష్, ముకుందం, జుబేర్, రమేష్, మహేష్, చాంద్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.