సమ్మెలో పంచాయతీ కార్మికులు

సమ్మెలో పంచాయతీ కార్మికులు

ముద్ర, పెద్ద శంకరం పేట:పెద్దశంకరంపేట మండల కేంద్రంలో గురువారం  మండలంలోని పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో బాగంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మెకు సంఘీభావం తెలిపిన కుల వివక్ష పోరాట సమితి మెదక్ జిల్లా బాధ్యులు సంగమేశ్వర మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి 11వ పిఆర్సిలో నిర్ణయించిన 19 వేల జీతాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు విధి నిర్వహణలో చనిపోతే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదని, కనీసం 10 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం చెల్లించాలని అన్నారు. అర్హత గల కార్మికులకు పదోన్నతులు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం  డిమాండ్లను పట్టించకోకుంటే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు బుగ్గల రాములు, వివేక్, రాములు, సాయిలు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.