రామాయంపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

రామాయంపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  తన్నీరు హరీష్ రావు బుధవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, హాజరయ్యారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని,  రామాయంపేటకు డిగ్రీ కళాశాల, మరో 200 డబుల్ బెడ్ ఇళ్లను,  ప్రత్యేకంగా అభివృద్ధి కోసం 50 కోట్ల నిధులను మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.