శతక పుస్తకం ఆవిష్కరణ

శతక పుస్తకం ఆవిష్కరణ

 చిన్నశంకరంపేట, ముద్ర: పుస్తకం ఒక దిక్కూచి, దిశ నిర్దేశానికి తోడ్పడుతుందని ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని సూరారం గ్రామంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఆవరణలో శంభుని కుమార్ రచించిన సురవరపు అనంత పద్మనాభ శతకం పుస్తకం ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అవలంబించాలన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత శంభుని కుమార్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆచార్య ఫణీంద్ర, ఆచార్య గౌరి శంకర్, సర్పంచ్ మల్కని నీరజ పవన్ గౌడ్, ఎంపిటిసి చిలుక అనురాధ, నాగరాజు, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.