సర్దార్ పాపన్నకు ఎమ్మెల్యే  పద్మ నివాళులు

సర్దార్ పాపన్నకు ఎమ్మెల్యే  పద్మ నివాళులు
  • విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

ముద్ర ప్రతినిధి, మెదక్:సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా మెదక్ లో ఎమ్మెల్యే ఎం.పద్మా దేవేందర్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  జాతీయ రహదారిపై మధ్యలో ఏర్పాటు చేయనున్న విగ్రహానికి భూమి పూజ చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న  పోరాటం  నేటి తరానికి ఆదర్శమన్నారు.

ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై ముందుకు సాగాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్  వెంకటేశ్వర్లు,  మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మున్సిపల్ ఛైర్మెన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, ఏడుపాయల దేవస్థానం చైర్మన్ సాతల్లి బాలాగౌడ్, గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్, మెదక్ పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు గడ్డమీద కృష్ణా గౌడ్, గౌడ సంఘం ప్రతినిధులు నర్సింలు, మంగా శంకర్ గౌడ్, ఆరేళ్ల జనార్దన్ గౌడ్, గూడూరి అరవింద్ గౌడ్, పీజీ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారం, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.