మెదక్ లో కాంగ్రెస్ సంబరాలు

మెదక్ లో కాంగ్రెస్ సంబరాలు

భారీ తెరపై ఫలితల వీక్షణ
ముద్ర ప్రతినిధి, మెదక్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మెదక్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద టపాసులు  కాల్చి, స్వీట్స్ పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ రావడంతో రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పవనాలు వీచే అవకాశం ఉందన్నారు. మోడీ ఇన్ని రోజులు ప్రజలకు అబద్దాలు చెప్తూ, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చురేపుతూ పబ్బం గడిపారని, నేడు వాటన్నింటినీ ప్రజలు పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారని పేర్కొన్నారు. ఇకనైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ నాయకులు మామిల్ల ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్, కౌన్సిలర్ రాజలింగం, నాయకులు మంగ మోహన్, లాలూ,  శ్రీనివాస్, అహ్మద్, చందు గౌడ్, సూఫీ, మహేందర్ రెడ్డి, అమీర్, అదిల్ మహేష్, దేవి ప్రసాద్, సంజీవ్, గణేష్, సూర్య, ప్రభాకర్, దాస్, ముజాంబిల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు మ్యాడం బాలకృష్ణ ఆధ్వర్యంలో ద్వారక లాడ్జి వద్ద టెంట్లు వేసి భారీ స్క్రీన్స్ పెట్టి ఫలితాలను వీక్షించా రు. నాయకులు రమేష్ రెడ్డి, హఫీజ్, అక్బర్, ఆవుల గోపాల్ రెడ్డి, గుండారం కిషన్ గౌడ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.