5న జడ్పి ముందు టిపిటిఎఫ్ నిరసన ప్రదర్శన

5న జడ్పి ముందు టిపిటిఎఫ్ నిరసన ప్రదర్శన

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఈనెల 5న జరిగే నిరసన ప్రదర్శనను జిల్లాలోని ఉపాద్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ మెదక్ జిల్లా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి. సంగయ్య, వెంకట్రాంరెడ్డి కోరారు. సాధారణ భవిష్యత్ నిధిపై ఉన్న ఆర్థిక ఆంక్షలు తొలగించాలని, మంజూరు చేయబడిన పెండింగ్లో ఉన్న లోన్లు, పార్ట్ ఫైనల్స్, ఫైనల్ పేమెంట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

2006-07 నుండి 2021-2022 వరకు జడ్పి జిపిఎఫ్ కు ప్రభుత్వం చెల్లించాల్సిన 2741.82 కోట్లు వడ్డీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిపిఎఫ్ ఖాతాలలో మిస్సింగ్ క్రెడిట్ ఉన్న సుమారు 1000 కోట్ల రూపాయలను సరిచేసి ఉపాధ్యాయుల ఖాతాలలో జమ చేయాలన్నారు. 2006 నుండి 2013 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు జడ్పి చెల్లించిన భూస్టర్ స్కీం బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. 2013-2014 నుండి నేటి వరకు మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించవలసిన భూస్టర్ స్కీమ్ నిధులు ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు