రైతు రుణమాఫీ సంబరాలు

రైతు రుణమాఫీ సంబరాలు
  • వికారాబాద్ లో ముఖ్యమంత్రి  కేసీఆర్  చిత్రపటానికి క్షీరాభిషేకం 

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-దేశవ్యాప్తంగా తెలంగాణ మాదిరి రైతు సంక్షేమం అందించేందుకు దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్  అన్నారూ.గురువారం నాడు వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో  రైతు రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి  కేసీఆర్ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ఏ సందర్భంలో ఏం కావాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలుసని తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారన్నారు. ప్రతిపక్షాల ప్రగల్బాల మాటలు నమ్మరాదని, వాళ్ళు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ లాంటి రైతు సంక్షేమ విధానాలను అమలు చేయడంలేదన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.