రైతు పక్షపాతి కెసిఆర్

రైతు పక్షపాతి కెసిఆర్
  • జడ్పీ చైర్ పర్సన్ హేమలత గౌడ్

తూప్రాన్ :ముద్ర :-రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత గౌడ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  19 వేల కోట్లు రుణమాఫీ విడుదల చేసి  30 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది అని అన్నారు.రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటానికి రైతులతో కలిసి క్షిరాబిశేఖం చేశారు.అదేవిదంగా మండలంలోని గౌతోజీగూడ, దండుపల్లి, కొనాయిపల్లి పర్కిబండ, కుచారం తదితర గ్రామాలలో సిఎం చిత్ర పాటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు నాగి రెడ్డి,రమేష్ గౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ బిక్షపతి , ఎమ్మార్పీఎస్ నాయకులు సుధాకర్, దండు పల్లి ఉప సర్పంచ్ మహెంధర్ గౌడ్ , ప్రభాకర్ రెడ్డి , శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు.