డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముద్ర, ముషీరాబాద్: నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అడిక్మెట్ డివిజన్ ఎస్వీఎస్ కాలేజ్ పక్కన డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులను సోమవారం ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సురేందర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మనోహర్ సింగ్, ఖదీర్, అబ్బో బాయ్, సత్యనారాయణ, ఖలీల్, టైలర్ శీను, జైసింహ, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.