జెపిఎస్ సోనీకి కొవ్వొత్తులతో నివాళులు

జెపిఎస్ సోనీకి కొవ్వొత్తులతో నివాళులు

ముద్ర ప్రతినిధి, మెదక్:  రెగ్యులరైజ్ చేయాలని సమ్మె చేస్తున్న క్రమంలో ఆత్మహత్యకు పాల్పడిన సోనీ ఆత్మ శాంతించాలని మెదగిల జేపీఎస్ ల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. వందలాదిమంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేతిలో కొవ్వొత్తులు పట్టుకొని సోనీ ఆత్మకు శాంతి చేకూరాలి.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ కావాలని నినాదాలు చేశారు. సోనీ ఆత్మహత్యతో ప్రభుత్వం కళ్ళు తెరవాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు పద్మ,మాధవి, భానుకుమార్,భవాని , నాగరాజు, జగదీష్ తదితరాలు పాల్గొన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో....
 సోనీ ఆత్మ అందచేయకురాలని కోరుతూ మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెదక్ రాందాసు చౌరస్తాలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. సోనీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేయాలని డిమాండ్ చేశారు.