సూర్యాపేట లో కాంగ్రెస్ నాయకుల బైక్ ర్యాలీ
![సూర్యాపేట లో కాంగ్రెస్ నాయకుల బైక్ ర్యాలీ](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645fb9b64d2a2.jpg)
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో కొత్త బస్టాండ్ సెంటర్, తెలంగాణ తల్లి విగ్రహం, శంకర్ విలాస్ పిఎస్ ఆర్ సెంటర్, అంబేద్కర్ విగ్రహం ఖమ్మం ఎక్స్ రోడ్ వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా టిపిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు మాట్లాడుతూ కర్ణాటకలో బిజెపి పై సాధించిన ఘన విజయం తరువాత తెలంగాణ రాష్ట్రములో కూడ కాంగ్రెస్ పార్టీ విజయం సాదిస్తుందని, పార్లమెంటు ఎన్నికలలో విజయం సాదించి, ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని అన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ ఆలీ, కౌన్సిలర్ బైరు శైలేందర్, సేవాదళ్ అధ్యక్షులు ఆలేటి మాణిక్యం, గడ్డం వెంకన్న, బంధం విష్ణు, నరేందర్ నాయుడు, సాయినేత, ఖమ్మంపాటి మధు, పలువురు నాయకులు పాల్గొన్నారు.