టాటా ఏస్ ద్విచక్ర వాహనం డీ..

టాటా ఏస్ ద్విచక్ర వాహనం డీ..

వ్యక్తి మృతి. ఒకరికి గాయాలు.

మెట్‌పల్లి ముద్ర:- టాటా ఏస్, ద్విచక్ర వాహనం డీకొని వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి లో చోటు చేసుకుంది. ఎస్ ఐ ఉమాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మల్లారం గ్రామానికి చెందిన మాడ హనుమాన్లు, బిచ్కుంద గ్రామానికి చెందిన లక్ష్మణ్ లు మోర్తాడ్ గ్రామంలో జీవిస్తున్నారు. తమ పనుల నిమిత్తం మెట్‌పల్లి పట్టణానికి వచ్చి మోర్తాడ్ వెళుతుండగా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామంలో జాతీయ రహదారిపైకి ఏపి 15 టీబీ 4323 నంబర్ గల టాటా ఏస్ వాహనం ఒక్కసారిగా జాతీయ రహదారిపైకి దూసుకురాగా ద్విచక్ర వాహనం టాటా ఏస్ వాహనానికి ఢీకొని మాడ హనుమాన్లు అక్కడికక్కడే మరణించాడు. లక్ష్మణ్ కు బలమైన గాయాలు కావడంతో నిజామాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య నరసవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.