మృతుల కుటుంబాలను పరామర్శించిన పొన్నం

మృతుల కుటుంబాలను పరామర్శించిన పొన్నం

సైదాపూర్,ముద్ర: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఇద్దరు సీనియర్ కార్యకర్తల కుటుంబాలను శనివారం రోజున కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. మండలంలోని బొమ్మకల్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏలూరి ఆదిరెడ్డి అల్లుడు విశ్రాంత విద్యాధికారి కాత నరసింహారెడ్డి ఇటీవల మృతి చెందారు. మండల కేంద్రం చెందిన కాంగ్రెస్ పార్టీ మండల మాజీ ఉపాధ్యక్షులు కొత్త రమణా రెడ్డి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.

కాగా వారి కుటుంబాలను పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఆయన వెంట పార్టీ మండల స్థాయి నాయకులు ముత్యాల మల్లేష్, ఊసకోయిల రాఘవులు, పల్లేని రవీందర్రావు, కిష్టయ్య, ఎంకేపల్లి మాజీ సర్పంచ్ దొంత సుధాకర్, వైస్ ఎంపీపీ కొత్త మల్లారెడ్డి, దాసరి సందీప్ తదితరులు ఉన్నారు.