అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్
![అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6454954f99cf6.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల రూరల్ మండల హబ్సిపూర్ గ్రామంలో జడ్పీ చైర్పర్సన్ దావవసంత సురేష్ తో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హబ్సీపూర్ గ్రామంలో నుండి వైకుంఠ దామం వరకు రూ. 60 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం, రూ.19 లక్షల ఎఫ్ డిఆర్ నిధులతో వాటర్ ట్యాంక్ నుండి డి 53 కెనాల్ వెళ్ళే దారిలో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, గ్రామంలో రూ. 3 లక్షలతో నిర్మించిన ఎస్సీ సంఘ భవనాన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, ఎఎంసి ఛైర్మెన్ నక్కల రాధ రవీందర్ రెడ్డి, సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్ల రెడ్డి, కౌన్సిలర్ ముస్కు నారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, ఎంపీటీసీ లక్ష్మి, ఉప సర్పంచ్ రమేష్, మోహన్ రెడ్డి, ఎంపిడిఓ రాజేశ్వరి, డిఇ మిలింధ్, ఎఇ రాజ మల్లయ్య, సర్పంచ్ లు చెరుకు జాన్, మహేశ్వర రావు, అరుణ అంజన్న, సునీల్, మహేష్, గిద్దే శంకర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.