వధువు వివాహానికి పుస్తె మట్టెలు అందజేసిన కంఠారెడ్డి

వధువు వివాహానికి పుస్తె మట్టెలు అందజేసిన కంఠారెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలీ ఘనపురం మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన గడ్డం నారాయణ సాయవ్వల కుమార్తె మధుశ్రీ వివాహానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి సౌజన్యంతో పుస్తె మట్టెలు శుక్రవారం అందచేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్కర్సు శ్రీనివాస్, మంజుల సిద్ధగిరి గౌడ్, శ్రీపతి శ్రీనివాస్ గౌడ్, మంగరిబోయిన సత్యనారాయణ, చెవ్వ రాములు, సాప శాంతి కుమార్ ముదిరాజ్, లంబాడి రమేష్, మహేష్, రమేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.