ఆర్థిక అక్షరాస్యతపై 2కె రన్.. జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ షా! | Mudra News

ఆర్థిక అక్షరాస్యతపై 2కె రన్.. జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ షా! | Mudra News

ముద్ర ప్రతినిధి, మెదక్: గో డిజిటల్ -గో  సెక్యూర్ అనే  అంశంతో 2020-2025  నాటికి దేశమంతటా ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగించేందుకు మంగళవారం మెదక్ లో 2కె రన్ ర్యాలీ నిర్వహించగా
జిల్లా కలెక్టర్ రాజర్షి షా జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వేణుగోపాల్ రావు, నాబార్డు ఎజిఎం సెసిల్ తిమోతి, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నగదు రహిత డిజిటల్ లావాదేవీలు  నిర్వహించాలన్న సంకల్పంతో భారతీయ రిజర్వు బ్యాంక్ ఈ నెల 13 నుండి 17 వరకు సరైన ఆర్ధిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుందనే అంశంతో  ఫైనాన్సియల్ లిటరసీ వారోత్సవాలు నిర్వహిస్తున్నదన్నారు.