బర్త్డే పార్టీకి పిలిచి బంధువులపై దాడి..! | Mudra News
ముద్ర ప్రతినిధి వికారాబాద్: కొడుకు బర్త్ డే కి బంధువులను పిలిచి మద్యం మత్తులో పిల్లలు,పెద్దలు అందరి పై విచక్షణ రహితంగా ఓ యువకుడు దాడి చేశాడు.వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీప గ్రామం అత్వెల్లి అర్దరాత్రి తర్వాత మద్యం మత్తులో యువకుడు హల్ చల్ సృష్టించాడు. గ్రామానికి చెందిన నవీన్ కుమార్"అనే యువకుని కుమారుని మొదటి బర్త్ డే కు బంధువులందరిని పిలిచాడు.అంతా బాగానే ఉంది కానీ..ఆ యువకుడు మద్యం మత్తులో వచ్చి బందువు రాజును కారు ఇవ్వమని అడుగ్గా మందు ఎక్కువైందని వాయించడం తో మొదలైన గొడవ.. సహనం కోల్పోయిన నవీన్ కుమార్ అనే యువకుడు బందువులందరి పై విచక్షణ రహితంగా దాడిచేసి ఇంట్లో నుంచి ఎవరూ వెళ్లకుండా బయటినుంచి తాలం వేసి హాల్ చల్ చేశాడు.పిల్లలు పెద్దలు బిక్కు బిక్కు మంటూ పోలీస్ డయల్ 100 కు సమాచారం ఇవ్వడంతో ... సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.