బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ నాయకుల చేరికలు..

బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ నాయకుల చేరికలు..

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో లో భారీ చేరికలు తాండూరు లో భారీ మెజారిటీ తో రోహిత్ రెడ్డి ని గెలిపిస్తాం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరులో    కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ నాయకులు  శుక్రవారం భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డ్ సమక్షంలో నియోజకవర్గ వ్యాప్తంగా యువకులు, కాంగ్రెస్, ఎస్ ఎఫ్ ఐ నాయకులు బిఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గం లోని యాలాల, తాండూరు పట్టణం 17 వార్డు, తాండూరు మండలం సిరిగిరిపేట్  యువకులు శుక్రవారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి తాండూరు అభివృద్ధి కి రోహిత్ రెడ్డి నే సరైన వ్యక్తి అని, యువకులం అందరం రోహిత్ రెడ్డి వెంటే ఉంటామని అన్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తోనే తాండూరు కు భవిష్యత్ ఉందని అన్నారు.