తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత బీఅర్ఎస్ దే..

తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత బీఅర్ఎస్ దే..

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత బీఅర్ఎస్ దే అని ప్రతి గ్రామానికి ప్రతి తండాకు 2 సంవత్సరాల్లో రూ.50 లక్షలు మంజూరు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దే అని అనీ జడ్పిటిసి సభ్యురాలు ప్రమోదిని అన్నారు.  పెద్దేముల్ మండలం కందేనెల్లి, జైరాం తండా, ఎర్రగడ్డ తండాలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఅర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ఆమె తండా వాసులకు వివారించారు. మూడవసారి కేసిఆర్ ముఖ్యమంత్రి, మళ్ళీ తాండూరులో రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గా అవగానే అమలు చేసే మానిఫెస్టో తెలియజేశారు. ప్రతి తండాకు 2 సంవత్సరాల్లో రూ.50 లక్షలు మంజూరు చేసింది ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కనీస సదుపయాలు లేక తండా వాసులు ఇబ్బంది చూసి బీ అర్ ఎస్ పార్టీ వచ్చాక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మరోసారి పట్టం కట్టాలని అని కోరారు.