రోహిత్ రెడ్డికి మద్దతు తెలిపిన పెర్కంపల్లి యువత
ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలో యాలాల మండలం పెర్కంపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు గ్రామ బీఆర్ఎస్ యువనేత కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో మంగళ వారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అలాగే గ్రామ యువ లీడర్గా కుర్వ శ్రీకాంత్, వైస్ లీడర్గా ఎం నరేష్ లను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈ సంద్భంగా నియమించారు . ఈ కార్యక్రమంలో ఎన్. శివకుమార్, ఎం శివకుమార్, ఎల్లప్ప , శివతో పాటు యువకులు పాల్గొన్నారు.