రోహితన్న వెంటే మేముసైతం అంటున్న ఉద్యమకారులు

రోహితన్న వెంటే మేముసైతం అంటున్న ఉద్యమకారులు

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణను  సీఎం కేసీఆర్  బంగారు తెలంగాణగా మారుస్తున్నారని.. రాష్ట్రం ఇలాగే సుభిక్షంగా ఉండాలంటే  సీఎం కేసీఆర్  మళ్లీ రావాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని ఉద్యమకారులతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ.. ఎలాగైతే ఉద్యమంలో ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమని  తాండూరు అభివృద్ధి కూడా యువ నాయకుడు పైలెట్ రోహిత్ రెడ్డి కే సాధ్యమన్నారు. మేమంతా రోహిత్ రెడ్డి కే మా మద్దతు అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులు వీరమని, మూజీబ్, నాగేందర్, తదితరులున్నారు.