సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించిన నన్నే మరోసారి ఆశీర్వదించండి

సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించిన నన్నే మరోసారి ఆశీర్వదించండి

వికారాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టే రౌడీల రాజ్యం వద్దు అని, మీలో ఒకడిగా ఉండి ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించిన నన్నే మరోసారి ఆశీర్వదించండి అని వికారాబాద్ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. గురు వారం వికారాబాద్ మండల పరిధిలోని ద్యాచారం సమీపంలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గం ధారూర్ మండల పరిధిలోని అంతారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో  పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొని ప్రసంగించారు.