కాంగ్రెస్ తోనే రైతు రాజ్యం సాధ్యం.. 

కాంగ్రెస్ తోనే రైతు రాజ్యం సాధ్యం.. 
TPCC members Kadempalli Srinivas Goud in Hath Se Hath Jodo Yatra

హాత్ సే హాత్ జోడో యాత్రలో  టీపీసీసీ సభ్యులు  కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్.. 

షాద్ నగర్, ముద్ర: కాంగ్రెస్ పార్టీతోనే రైతు రాజ్యం సాధ్యమని టీపీసీసీ సభ్యులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని కొండన్నగూడ, వెంకన్నగూడా, కొంగగూడతండా, మెళ్ళగూడతండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కెసిఆర్ పాలనలో విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, భవిష్యత్తులో రాబోయేది, రైతు రాజ్యమన్నారు. నియంతృత్వ, అవినీతి పాలన అంతమొందించే సమయం ఆసన్నమైందని, ఇక కొద్ది రోజులు ఓపిక పట్టి కాంగ్రెస్ ను గెలిపించుకుందామన్నారు.

కొండన్నగూడ గ్రామంలో ఇల్లు లేని నిరుపేద శాంతాబాయికి ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రవీందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుదీర్, ఎడ్ల శ్రీకాంత్ గౌడ్,  రవీందర్, వంశీ గౌడ్, ఎం.ఎస్.యూ. ఐ జిల్లా  కార్యదర్శి ఉదయ్ గౌడ్, షాద్ నగర్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ కాట సుధీర్, యూత్ కాంగ్రెస్  సెక్రటరీ మెరజ్, ఎం.ఎస్.యూ. ఐ నియోజకవర్గ అధ్యక్షులు జీజో, కొత్తూరు మున్సిపల్ కౌన్సిలర్స్ మాదారం నరసింహ, సోమ్లా నాయక్, జాండ్ల గూడెం శ్రీనివాస్ గౌడ్, పీర్ల గూడెం గోపాల్, ఎస్సీ సెల్ చైర్మన్ కరోళ్ల సురేందర్,  జనార్దన్ రెడ్డి, విష్ణు మూర్తి ,ఎలికట్ట వార్డ్ మెంబెర్ అశోక్, యూత్  కాంగ్రెస్ ఫరూక్ నగర్  మండల్ అధ్యక్షులు అనిమి మహేష్, కేశంపేట్ మండల అధ్యక్షుడు శివ, బోయినపల్లి నరేష్ సురేందర్, కొందుర్గు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల శ్రీకాంత్,  విరమోని శ్రీను, సురేందర్, లింగారెడ్డి గూడా మహేందర్, వెంకటేష్, ఇబ్రహీం, మహేందర్, ప్రశాంత్, సబ్బేర్, నిస్సార్ సమ్మి, మూర్తి, విష్ణు, రజనీకాంత్, శ్రీశైలం, పేపర్ యాదయ్య, సద్దాం, మహేందర్, సల్మాన్,  వెంకటేష్, రాజు, బాలు, రమణ అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.