అభివృద్ధి చూసే బీఆర్ఎస్ లో  చేరుతున్నాం

అభివృద్ధి చూసే బీఆర్ఎస్ లో  చేరుతున్నాం
  • బషీరాబాద్ మండలం కాసిం పూర్ గ్రామ
  • కాంగ్రెస్ నాయకుల చేరిక

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:- తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం ఖాశింపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో  బీ ఆర్ఎస్ పార్టీ లో చేరారు.  తాండూరు రూపురేఖలు మార్చిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంటే ఉంటామని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచినా బిఆర్ఎస్ పార్టీ కే మద్దతు ఇస్తామని వెల్లడించారు. తాండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ని భారీ మెజారిటీ తో రెండో సారి గెలిపించుకుంటామని వెల్లడించారు.