క్రాంతి కుమార్ తీరు నచ్చకే బిఎస్పీ కి రాజీనామా: కోలుకుందా రాజు

క్రాంతి కుమార్ తీరు నచ్చకే బిఎస్పీ కి రాజీనామా: కోలుకుందా రాజు

ముద్ర, ప్రతినిధి వికారాబాద్: బిఎస్పీ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు క్రాంతి కుమార్ కొందరిని మాత్రమే కలుపుకుపోతున్నారని ఆరోపిస్తూ బుదవారం మొమిన్ పేట మండల అధ్యక్షుడు కొలుకుందా రాజు బిఎస్పీ పార్టీ కి రాజీనామా చేశారు.స్నేహితులను మాత్రమే ప్రోత్సహించి పదవులు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఇక ముందు ఎలాంటి కార్యక్రమాలకు హాజరుకానని రాజు  తేల్చిచెప్పాడు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు పని చేస్తానని అన్నారు. ఇదిలా ఉంటే జిల్లా అధ్యక్షుడిగా క్రాంతి కుమార్ ను నియమించాక బీఎస్పీలో చురుకుగా పనిచేసిన సీనియర్ నాయకులు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం