బీఆర్ఎస్ లో చేరిన బాద్లాపూర్ కాంగ్రెస్ నాయకులు

బీఆర్ఎస్ లో చేరిన బాద్లాపూర్ కాంగ్రెస్ నాయకులు
  • కాంగ్రెస్ లో గుర్తింపు లేదు
  • రోహిత్ రెడ్డి వెంటే ఉంటాం
  • అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే కే మద్దతు

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: తాండూరు నియోజకవర్గం లోని బషీరాబాద్ మండలం బాద్లాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గ్రామ ఉపసర్పంచ్ మల్లేష్ ఆధ్వర్యంలో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఎన్నో ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ లో ఉన్న సరైన గుర్తింపు లేదని అన్నారు. రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ లోకి వచ్చినట్లుగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ తో రోహిత్ రెడ్డి ని మరోసారి గెలిపించుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమం లో శ్రీను, వడ్డే నర్సిములు, శ్రీనివాస్ గౌడ్, జనార్దన్ తదితరులు ఉన్నారు.