నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 

నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు బీఅర్ఎస్ అభ్యర్ధి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బుధవారం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. తాండూరులోని స్వగృహంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం అర్డిఓ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మంచి ముహూర్తం కాబట్టి కేవలం కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేయడం జరిగిందని ఆని ఆయన అన్నారు. రేపు గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి మరో దఫా నామినేషన్ దాఖలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.