కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా  నామినేషన్ దాఖలు చేసిన మనోహర్ రెడ్డి 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా  నామినేషన్ దాఖలు చేసిన మనోహర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: తాండూరు నియోజకవర్గం తాండూరు పట్టణ కేంద్రంలోని ఆర్డిఓ ఆఫీసులో  కాంగ్రెస్ అభ్యర్థి బియ్యని మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కలిసి శనివారం తన నామినేషన్  దాఖలు చేశారు. తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిన బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలుపుతున్నారనీ, ఎన్నికల్లో భారీ మెజార్టీ తో తాను విజయం సాధిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఎం. రమేష్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కల్వా సుజాతా, ధారసింగ్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులున్నారు.