తాండూర్ లో బీఆర్ఎస్ జోరుగా ఇంటింటి ప్రచారం..

తాండూర్ లో బీఆర్ఎస్ జోరుగా ఇంటింటి ప్రచారం..
  • తాండూరు అభివృద్ధి చేసింది రోహిత్ రెడ్డి నే
  • మరో సారి ఆశీర్వదించి గెలిపించండి
  • మరింత అభివృద్ధి చేసి చూపిస్తాడు
  • ఎన్నికల ప్రచారం లోఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి. పైలెట్  విజయం కోసం మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ వీణా శ్రీనివాస్ చారి, ఇతర ప్రజా ప్రతినిధిలు తో కలిసి ఇంటింటికి తిరుగుతూ.. ప్రచారం చేస్తున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 12వ వార్డ్ లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వార్డ్ లోని ప్రతి ఇంటికి తిరుగుతూ.... రోహిత్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను తెచ్చిన ఘనత రోహిత్ రెడ్డి కే దక్కిందని అన్నారు.  కాలుష్య రహిత తాండూరు గా మర్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని వార్డ్ ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో మరో సారి రోహిత్ రెడ్డి ని భారీ మెజారిటీ తో తాండూరు లో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ లు సంగీతా ఠాకుర్, సుమిత్ గౌడ్ వార్డ్ ఇంచార్జిలు సాగర్ గౌడ్, బబ్లూ, ఇంతియాజ్ నాయకులు అనిత, నయ్యర్ ఖాన్ తదితులున్నారు.