మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అడ్వర్యం లో కాంగ్రెస్ లో చేరిన బీజేపీ, బీ ఆర్ ఎస్ నాయకులు

మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అడ్వర్యం లో కాంగ్రెస్ లో చేరిన బీజేపీ, బీ ఆర్ ఎస్ నాయకులు

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పెట్ మండల కేంద్రం బిఆర్ఎస్ పార్టీకి చెందిన15 మంది కార్యకర్తలు గురు వారం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే మోమిన్ పెట్ మండల్  గోవిందపురం గ్రామం బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ బుచ్చయ్య, అలాగే వారితోపాటు 20 మంది కార్యకర్తలు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్  సమక్షంలో బీఆర్ఎస్, బిజెపి పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.