ఆ విగ్రహ ఏర్పాటుకు విరాళం అందజేసిన యువకుడు
ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో చత్రపతి శివాజీ విగ్రహా ఏర్పాటుకు స్వచ్చందంగా ముందుకు వచ్చి బుధవారం ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు ఏనుగు జైపాల్ రెడ్డి 20 వేల రూపాయలు విరాళం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ విగ్రహానికి తన వంతు సాయం అందించానని, ప్రతి ఒక్కరు విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో భాగస్వాము లు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివాజీ ఉత్సవ కమిటీ బృందం,హిందూ బంధువులు,తదితరులు పాల్గొన్నారు.