ప్రజల బాంధవుడు కెసిఆర్ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి బలపరచాలి - ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
ముద్ర ప్రతినిధి, వికారాబాద్: రైతులు పేద ప్రజల సంక్షేమాన్ని కోరే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్
అన్నారు. ఆదివారం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని బంట్వారం మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రైతు బంధు పథకంతో రైతుల రంధీ తీర్చి, ప్రజా సంక్షేమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రజల బాంధవుడు కెసిఆర్ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి బలపరచాలని కోరారు.