బషీరాబాద్ సర్పంచ్ ప్రియాంక కాంగ్రెస్లో చేరిక

బషీరాబాద్ సర్పంచ్ ప్రియాంక కాంగ్రెస్లో చేరిక

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ బషీరాబాద్ పంచాయతీ సర్పంచ్ ప్రియాంక శ్రావణ్ శుక్రవారం తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు . ఈమెతో పాటు బీఆర్ఎస్ అధ్యక్షురాలు స్రవంతి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీధితోపాటు అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంచాయతీ ఎన్నికల సమయంలో మహేందర్ రెడ్డి వారికి కొనసాగిన బసరాబాదు సర్పంచ్ ప్రియాంక ఆ తర్వాత పైలెట్ రోహిత్ రెడ్డి వర్గం లో చేరి బి ఆర్ ఎస్ పార్టీ కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు. అయితే బషీరాబాద్ పట్టణానికి చెందిన తాండూర్ మాజీ ఎమ్మెల్యే ఎం .నారాయణ రావు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడంతో సర్పంచ్ ప్రియాంక కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరిచారు.