బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

 ఏకాంబర రామలింగేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు

ముద్ర ప్రతినిధి , వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని  మనోహర్ రెడ్డి ఆది వారం బషీరాబాద్ మండలం నేలపల్లి అటవీ ప్రాంతంలోని ఏకాంబరి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన బసిరబాద్ మండలం నీలపల్లి, ఇస్మాఇల్ పూర్ ,పర్వత్ పల్లి, మర్పల్లి, నవల్గ, మైల్వార్ తదితర గ్రామాలలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బషీరాబాద్ మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎన్నికల  ప్రచారం ప్రారంభించారు. బషీరాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు ఏం రాకేష్, ఎస్. వెంకటేష్ ,మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు గౌడ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.