వలిగొండ  మండలంలో కుంభం జోరు

వలిగొండ  మండలంలో కుంభం జోరు

వలిగొండ (ముద్ర న్యూస్) : వలిగొండ మండల వ్యాప్తంగా కాంగ్రెస్ జోరు రోజు రోజుకు పెరుగుతోంది. ఇటీవలే పార్టీ మారి బి.ఆర్.ఎస్ లో చేరిన కుంభం అతి తక్కువ సమయంలోనే మళ్ళీ కాంగ్రెస్ లో చేరి నియోజక వర్గం వ్యాప్తంగా రెట్టించిన ఉత్సాహంతో తన జోరును కొనసాగిస్తున్నారు. నియోజక వర్గం ప్రజలకు ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ మంచి మనసున్న నేత గా, ఒక అన్నగా అందరి మన్ననలు పొందుతూ జనం మనిషిగా గురింపు తెచ్చుకున్నారు.  కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ అధిగమించి అందరినీ కలుపుకొని ముందుకు దూసుకుపోతున్నారు. నియోజక వర్గం వ్యాప్తంగా ఆయన చేసిన ఎన్నో మంచి పనులు ఆయన్ను నియోజక వర్గం లో ఒక గొప్ప నేతగా తయారుచేసాయి. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందికి తన సొంత ఖర్చుతో ఆదుకున్నారు. కరోనా సమయంలో అంబులెన్స్ లు ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణం పోశారు. వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో అసువులు బాసిన కూలీలకు తన సొంత డబ్బులు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకున్నారు. ఇలా ఎన్నో కర్యక్రమాలు నిర్వహిస్తూ భువనగిరి నియోజక వర్గంలో తన మార్కును చాటుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలో భువనగిరి టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరి లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో నిలిచి భువనగిరి ఖిల్లా పై కాంగ్రెస్ జెండా ను ఎగురవేసి సత్తా చాటాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తు  మండల నియోజక వర్గం లో పెద్ద ఎత్తున కార్యకర్తలను పార్టీలోకి చేరికలు చేస్తున్నారు.