కార్మికురాలిని పరామర్శించిన చైర్మన్
ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి పురపాలక సంఘంలోని పారిశుద్ధ్య కార్మికురాలు మొగిలిపాక హంస ప్రమాదవశాత్తు కింద పడి గాయాలు కాగా విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కింద పడడం వల్ల కాళ్లు, చేతులకు గాయాలయ్యాయని చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. చైర్మన్ వెంట కౌన్సిలర్ పంగరెక్క స్వామి ఉన్నారు.