అన్ని తామై ముందుకు సాగిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు
![అన్ని తామై ముందుకు సాగిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64c635b5bdf91.jpg)
భువనగిరి జూలై 30 (ముద్ర న్యూస్) భువనగిరి మున్సిపల్ పరిధి లో రాయగిరికి చెందిన ఎరుకల మల్లి కొన్ని రోజుల క్రితం ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందగా ఫ్రెండ్స్ యూత్ సభ్యులు అన్ని తామై అంత్యక్రియలకు నిర్వహించారు. గ్రామ యువకులు చంద రూపంలో పైసలు వేసుకొని వారికి తోడుగా మున్సిపల్ వైస్ ఛైర్మెన్ చింతల కిష్టయ్య, పల్లేర్ల యాదగిరి వంతు 5000రూపాయల సహాయంతో అంత్యక్రియలు జరిపించారు. 3వ రోజు కార్యక్రమం యువకుల పైసల తోనే దగ్గర వుండి జర్పించారు. కార్యక్రమం లో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.