కిషన్ రెడ్డికి సంఘీభావం ప్రకటించిన హరిశంకర్ గౌడ్.....

కిషన్ రెడ్డికి సంఘీభావం ప్రకటించిన హరిశంకర్ గౌడ్.....

ఆలేరు (ముద్ర న్యూస్):ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందడాన్ని నిరసిస్తూ హైదరాబాదులోని ఇందిరా పార్క్ దగ్గర బుధవారం నాడు కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి చేపట్టిన 24 గంటల దీక్షను బుధవారం నాడు పోలీసులు భగ్నం చేయడాన్ని బిజెపి రాష్ట్ర నాయకులు సుదగాని హరి శంకర్ గౌడ్ తప్పుపట్టారు. గురువారం నాడు హైదరాబాదులోని నాంపల్లి లో గల బిజెపి రాష్ట్ర కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్న కిషన్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం ప్రకటించారు. మాట్లాడుతూ విద్యార్థులు. యువత. నిరుద్యోగుల జీవితాలతో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా చెలగాటం ఆడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రానున్న ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరించారు. వెంటనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.