రిటైర్డ్ టీచర్లు కాంగ్రెస్ లో చేరిక

రిటైర్డ్ టీచర్లు కాంగ్రెస్ లో చేరిక

మోత్కూర్(ముద్ర న్యూస్): భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో మోత్కూర్ మండలానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ మన్నే అంజయ్య, రిటైర్డ్ టీచర్ కొప్పుల రవీందర్ రెడ్డి,అండెం దయాకర్ రెడ్డీలు కాంగ్రెస్ లో చేరారు.పార్టీలో చేరిన వారిని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఫైళ్ల సోమిరెడ్డి, టిపిసిసి నాయకుడు ఈటీకాల చిరంజీవి, బీసు మల్లిఖార్జున్,బీసు భాష ,గుండు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.